Telugu Global
Telangana

'దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారనుంది'

విప్లవాత్మకమైన TSiPASS ప్రవేశంతో తెలంగాణలో పారిశ్రామిక రంగం ఊపందుకుంది, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 23,000 కొత్త పరిశ్రమలకు అనుమతులను ఇచ్చింది. ఇది 20 లక్షల మందికి ఉపాధిని సృష్టించడంతో పాటు 3.30 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది అన్నారు కేటీఆర్.

దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్  తయారీకి తెలంగాణ కేంద్రంగా మారనుంది
X

రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EV) పాలసీని తీసుకువచ్చిందని, అందువల్ల‌ దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తెలంగాణ హబ్‌గా మారుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

సోమవారం జహీరాబాద్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా (M&M)లో భాగమైన మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ (LMM) ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేసిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి, వికారాబాద్ జిల్లా యెంకతల, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లలో మూడు హబ్‌లను ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ప్రోత్సహిస్తోందన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమకు ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్తు అని పేర్కొన్న కేటీఆర్, ఎలక్ట్రిక్ వాహనాలతో మాత్రమే కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు .

ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ ఫార్ములా ఇ రేస్‌ను నిర్వహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ప్రకటించిందని కేటీఆర్ తెలిపారు. దివిటిపల్లి ఇన్నోవేషన్ హబ్‌గా ఉండగా, యెంకతల పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా మారుతుంది. జహీరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కేంద్రంగా మారుతుంది అని ఆయన తెలిపారు.

EV తయారీదారులను ప్రోత్సహించే లక్ష్యంతో, GHMC, TSRTC , ఇతర ప్రభుత్వ రంగంలో ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం EVలను కొనుగోలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు..

విప్లవాత్మకమైన TSiPASS ప్రవేశంతో తెలంగాణలో పారిశ్రామిక రంగం ఊపందుకుంది, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 23,000 కొత్త పరిశ్రమలకు అనుమతులను ఇచ్చింది. ఇది 20 లక్షల మందికి ఉపాధిని సృష్టించడంతో పాటు 3.30 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది అన్నారు కేటీఆర్. జహీరాబాద్‌లో నైపుణ్యం పెంపుదల కేంద్రం ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని M&M యాజమాన్యాన్ని కోరారు. స్థానిక యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

First Published:  25 April 2023 3:38 AM GMT
Next Story