Telugu Global
Telangana

వైసీపీ కార్యకర్తపై టీ-టీడీపీ నేతల దాడి

తొలుత క్షమాపణ చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు. అందుకు నరసింహా అంగీకరించకపోవడంతో దాడిచేశారు. ఈ దాడి కూడా ఖమ్మంలోని వైసీపీ కార్యాలయం వద్దే జరిగింది. దాడి దృశ్యాలు బయటకు వచ్చాయి.

వైసీపీ కార్యకర్తపై టీ-టీడీపీ నేతల దాడి
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ వైసీపీ కార్యకర్తను ఖమ్మం జిల్లా టీడీపీ నాయకులు కొట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ.. ఖమ్మంలో వివాహం చేసుకున్నారు. ఆర్‌ఎంపీగా పనిచేసే నరసింహా ఇటీవల చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై పోస్టులు పెట్టారు. దాంతో ఆగ్రహించిన ఖమ్మం టీడీపీ నేతలు.. అత్తారింటికి వచ్చిన సమయంలో నరసింహపై దాడి చేశారు.

తొలుత క్షమాపణ చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు. అందుకు నరసింహా అంగీకరించకపోవడంతో దాడిచేశారు. ఈ దాడి కూడా ఖమ్మంలోని వైసీపీ కార్యాలయం వద్దే జరిగింది. దాడి దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కూడా దాడిని టీడీపీ నేతలు సమర్ధించుకున్నారు. నారా బ్రహ్మణిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకే కొట్టామని వివరించారు. చంద్రబాబు కుటుంబసభ్యుల జోలికి వస్తే తెలంగాణ టీడీపీ కూడా ఊరుకోబోదని.. ఖమ్మం టీడీపీ నేతలు కేతినేని హరీష్, కూరపాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

First Published:  30 Sep 2022 4:16 AM GMT
Next Story