Telugu Global
Telangana

ధాన్యం ఉత్పత్తిలో దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ – మంత్రి గంగుల కమలాకర్

గడిచిన తొమ్మిదేళ్ళలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

ధాన్యం ఉత్పత్తిలో దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ – మంత్రి గంగుల కమలాకర్
X

ధాన్యం ఉత్పత్తిలో దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ – మంత్రి గంగుల కమలాకర్

గడిచిన తొమ్మిదేళ్ళలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలో పదిరెట్లు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, దాన్ని సద్వినియోగపరుస్తూ తెలంగాణ బ్రాండ్ క్రియేట్ చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మిల్లింగ్ పరిశ్రమల స్థాపనపై జపాన్ కు చెందిన ప్రముఖ కంపెని సటాకే కార్పోరేషన్ ప్రతినిధులతో మంత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆవిర్బావ సమయంలో ఉన్న 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి క్రమంగా దిగుబడి పెరుగుతూ ఈ సీజన్లోనే కోటీ ముప్పై లక్షల టన్నులకు చేరిందన్నారు.

ఇది కేవలం పౌరసరఫరాల శాఖ ద్వారానే సేకరించినది మాత్రమేనని.... ఇది గాక బహిరంగ మార్కెట్లోకి సైతం ధాన్యం తరలుతుందన్నారు. ఇంత పెద్ద స్థాయిలో వస్తున్న ధాన్యం ఉత్పత్తికి మరింత మద్దతు అందజేస్తూ వేగంగా మిల్లింగ్ చేయడంతో పాటు రైతుల ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి చేర్చడమే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తులు తగ్గుతుంటే కేవలం తెలంగాణలో మాత్రమే పెరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకొనే దిశలో ప్రభుత్వ ప్రణాళికలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ సందర్భంగా సటాకే కార్పోరేషన్ కంపెనీ ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మంత్రికి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా యూఎస్, యూకే, థాయ్ లాండ్, చైనా, వియాత్నాం తదితర వరి పండించే దేశాల్లో తమ కంపెనీ మిల్లింగ్ యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు.

అత్యధికంగా రోజుకు లక్ష టన్నుల వరకూ మిల్లింగ్ సామర్థ్యం ఉందన్నారు. మిల్లింగ్ తో పాటు నిల్వ సామర్థ్యం, బ్రాయిలర్ల పనితీరు, ఉప ఉత్పత్తులు తదితర అన్ని అంశాలను మంత్రి వారితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్, జపాన్ సటాకే కార్పోరేషన్ డైరెక్టర్ ఆర్.కె.బజాజ్, ఎజీఎం హెచ్.సతీష్ కుమార్, డీలర్లు కె.విఠల్, కె. వినయ్ కుమార్ పాల్గొన్నారు.

First Published:  23 Jun 2023 5:07 PM GMT
Next Story