Telugu Global
Telangana

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌

డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు.. ఏడాదికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుందని ఆయ‌న పేర్కొన్నారు. పెంచిన డీఏ ప్రకారం రూ.1,380 కోట్ల ఎరియర్స్‌ను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని వివ‌రించారు.

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌
X

తెలంగాణ స‌ర్కారు రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష‌న్ దారుల‌కు ఒక డీఏ విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్ల‌డించారు. ఉద్యోగుల మూల వేత‌నం, పెన్ష‌న్‌పై 2.73 శాతం డీఏ పెరుగుద‌ల ఉంటుంద‌ని వివ‌రించారు. పెరిగిన డీఏ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వ‌స్తుంద‌ని చెప్పారు.

బకాయిలను తర్వాత విడుదల చేయనున్న ప్రభుత్వం.. జూన్ నెల వేతనం, పెన్ష‌న్‌తో పాటు పెరిగిన డీఏను జూలైలో చెల్లించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డీఏ పెంపుతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్ష‌న్‌దారుల‌కు ప్రయోజనం కలగనున్నట్టు హరీశ్ రావు వెల్ల‌డించారు. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు.. ఏడాదికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుందని ఆయ‌న పేర్కొన్నారు. పెంచిన డీఏ ప్రకారం రూ.1,380 కోట్ల ఎరియర్స్‌ను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని వివ‌రించారు.

First Published:  20 Jun 2023 1:34 AM GMT
Next Story