Telugu Global
Telangana

మహేష్ బాబుకి మాతృ వియోగం

ఎమ‌ర్జెన్సీ వార్డులో వెంటిలేట‌ర్ పై ఉంచి రెండురోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం 4గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

మహేష్ బాబుకి మాతృ వియోగం
X

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఇటీవల గ‌చ్చిబౌలిలోని AIG ఆసుప‌త్రిలో చేర్పించారు. ఎమ‌ర్జెన్సీ వార్డులో వెంటిలేట‌ర్ పై ఉంచి రెండురోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం 4గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

వరుస విషాదాలు..

మూడేళ్ల కాలంలో ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు జరిగాయి. 2019లో విజ‌య నిర్మ‌ల మృతి చెందారు. క‌రోనా స‌మ‌యంలో కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు మృతి చెందారు. ఇప్పుడు కృష్ణ భార్య ఇందిరాదేవి కూడా తుదిశ్వాస విడిచారు.

1961లో కృష్ణ, ఇందిరాదేవి వివాహం జరిగింది. పద్మ, మంజుల, ఇందిర ప్రియదర్శిని, రమేష్‌ బాబు, మహేష్‌బాబు.. ఆమె సంతానం. ఆ తర్వాత కృష్ణ, విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నా.. కుటుంబంలో పొరపొచ్చాలు రాకుండా అందరూ కలిసే ఉన్నారు. ఇద్దరు కొడుకులు హీరోలుగా ఉన్నా కూడా ఇందిర ఏనాడూ సినిమా ఫంక్షన్లకు వచ్చేవారు కాదు. ఇందిరాదేవి పుట్టినరోజున, మదర్స్ డే, ఉమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టి, తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్‌ బాబు. కుటుంబ సభ్యులు కూడా ఆమెతో కలసి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు. ఇందిరా దేవి మరణంపై సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివ దేహాన్ని పద్మాలయ స్టూడియోకు త‌ర‌లిస్తారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

First Published:  28 Sep 2022 2:47 AM GMT
Next Story