Telugu Global
Telangana

సోషల్ మీడియాకి బుక్కైపోయిన రాజగోపాల్ రెడ్డి..

నీచ్, కమీనే అంటూ.. అప్పట్లో రాజగోపాల్ రెడ్డిని, రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. "మూడడుగుల రేవంత్.. నీ పర్సనాల్టీకి తగ్గట్టు మాట్లాడు" అంటూ రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు.

సోషల్ మీడియాకి బుక్కైపోయిన రాజగోపాల్ రెడ్డి..
X

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవసరం లేకపోయినా మునుగోడు ఉప ఎన్నికలకు కారణం అయిన ఆయన.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అయితే ఏడాది క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లిన సమయంలో ఆయన డైలాగులు, ట్వీట్లు, మీడియా సమావేశంలో విసిరిన సవాళ్లు మళ్లీ హైలైట్ అవుతున్నాయి. రేవంత్ తో పనిచేయడం కంటే రాజకీయాలు వదిలేయడం బెటర్ అంటూ గతంలో ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అంతే కాదు.. అప్పట్లో రేవంత్, రాజగోపాల్ మధ్య జరిగిన మాటల యుద్ధం వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి.

నీచ్, కమీనే అంటూ.. అప్పట్లో రాజగోపాల్ రెడ్డిని, రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. "మూడడుగుల రేవంత్.. నీ పర్సనాల్టీకి తగ్గట్టు మాట్లాడు" అంటూ రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆ వీడియోలు మళ్లీ ట్రెండింగ్ లోకి రావడంతో కలకలం రేగింది.

గతంలో నాడు నేడు అంటూ టీవీ ఛానెళ్లలో పాత వీడియోలు వెదికి వేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో నిమిషాల వ్యవధిలోనే పాత స్టఫ్ అంతా బయటకొచ్చేస్తోంది. అందులోనూ మూనుగోడు ఎన్నికలు జరిగి ఏడాదే అవుతోంది. అందుకే రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాకి అడ్డంగా బుక్కైపోయారు. బీజేపీలోకి వెళ్లిన సమయంలో కాంగ్రెస్ పై, కాంగ్రెస్ నాయకులపై నిందలు వేసిన ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం విశేషం. బీజేపీ నేతల్ని ఆయన పల్లెత్తు మాట అనలేదు, కేవలం బీజేపీకి అంత సీన్ లేదని, ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని మాత్రమే చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై కాంగ్రెస్ నాయకులు పెద్దగా స్పందించడంలేదు.

First Published:  26 Oct 2023 3:24 AM GMT
Next Story