Telugu Global
Telangana

షర్మిల Vs జగ్గారెడ్డి... పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల , కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఒకరినొకరు పొట్టుపొట్టు తిట్టుకుంటున్నారు. ఒకరు బీజేపీ వదిలిన బాణం అంటే, మరొకరు కోవర్టు అంటూ ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

షర్మిల Vs జగ్గారెడ్డి... పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు
X

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల , వైఎసార్ ప్రియ శిశ్యుడు, కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి మధ్య మాటల‌ యుద్దం జరుగుతోంది. సంగారెడ్డి పర్యటన సందర్భంగా షర్మిల జగ్గా రెడి మీద విమర్శలు చేశారు. ఇక్కడి ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విరుచుకపడ్డారు.

షర్మిల విమర్శలపై జగ్గారెడ్డి భగ్గుమన్నారు. గత పాదయాత్రలో జగనన్న వదిలిన బాణాన్నని చెప్పిన‌ షర్మిల ఇప్పుడు వైఎస్ వదిలిన బాణాన్ని అని చెబుతున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ చనిపోయి అందరం బాధలో ఉంటే.. జగన్, షర్మిల, విజయమ్మ సీఎం ఎవరనేదానిపై చర్చించుకున్నారని గుర్తుచేశారు. షర్మిల, జగన్ బీజేపీ వదిలిన బాణాలని జగ్గారెడ్డి ఆరోపించారు.

దీంతో జగ్గా రెడ్డిపై షర్మిల మళ్ళీ ఆరోపణలు గుప్పించారు. జగ్గారెడ్డి ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని ఆరోపించిన షర్మిల ఆయన కేటీఆర్ కు కోవర్టు అని అన్నారు. జగ్గారెడ్డిని ఎవరు పిలిచినా.. వాళ్ల పార్టీలోకి వెళ్తారు అని షర్మిల వ్యాఖ్యానించారు.

ఈ విధంగా ఒకరిపై ఆరోపణలు చేసుకుంటూ పొట్టు పొట్టు తిట్టుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

First Published:  26 Sep 2022 5:06 PM GMT
Next Story