Telugu Global
Telangana

రైలు ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌..! - 20, 21 తేదీల్లో ప‌లు రైళ్ల ర‌ద్దు.. మ‌రికొన్ని భారీగా ఆల‌స్యం

ఈ ప‌నుల వ‌ల్ల ఈ నెల 20, 21 తేదీల్లో మొత్తం 17 రైళ్లు ర‌ద్దు కాగా, ఇంకొన్ని ప్రధాన రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయని అధికారులు తెలిపారు. వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే గురువారం రాత్రి ఒక‌ ప్రకటనలో వెల్లడించింది.

రైలు ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌..! - 20, 21 తేదీల్లో ప‌లు రైళ్ల ర‌ద్దు.. మ‌రికొన్ని భారీగా ఆల‌స్యం
X

సికింద్రాబాద్ డివిజన్‌లోని ఘట్కేసర్- చర్లపల్లి స్టేషన్ల మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణం జ‌రుగుతుండ‌టంతో ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు, మ‌రికొన్నింటిని రీ షెడ్యూల్ చేస్తున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ఆర్‌యూబీ ప‌నుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు రాక‌పోక‌లు సాగించే రైలు ప్ర‌యాణికుల‌కు ఈ నెల 20, 21 తేదీల్లో దీనివ‌ల్ల అవాంత‌రం ఏర్ప‌డుతుంద‌ని వివ‌రించారు. ఈ ప‌నుల వ‌ల్ల ఈ నెల 20, 21 తేదీల్లో మొత్తం 17 రైళ్లు ర‌ద్దు కాగా, ఇంకొన్ని ప్రధాన రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయని అధికారులు తెలిపారు. వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే గురువారం రాత్రి ఒక‌ ప్రకటనలో వెల్లడించింది.

రద్దయిన రైళ్లు ఇవే..

ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు.. వరంగల్ - సికింద్రాబాద్ (రైలు నంబర్ 07757); సికింద్రాబాద్ -వరంగల్ (07462); వరంగల్ - హైదరాబాద్ (07463); హైదరాబాద్- కాజీపేట(07758); కాచిగూడ -మిర్యాలగూడ (07276); మిర్యాలగూడ-నడికుడి(07277); నడికుడి-మిర్యాలగూడ (07973); మిర్యాలగూడ-కాచిగూడ (07974); సికింద్రాబాద్- రేపల్లె(17645); గుంటూరు-వికారాబాద్(12747); వికారాబాద్-గుంటూరు (12748); హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్(17011); సిర్పూర్ కాగజ్ నగర్- హైదరాబాద్(17012); సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్- గుంటూరు (17202); గుంటూరు- సికింద్రాబాద్ (17201); సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ (17233) రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేశ్ ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు.

ఆల‌స్యంగా న‌డిచే రైళ్ల వివ‌రాలివీ..

ఈ నెల 20వ తేదీ శ‌నివారం నాడు.. కొన్ని ప్రధాన రైళ్లు గంట నుంచి 3 గంటల పాటు ఆలస్యంగా నడవనున్నాయి. హావ్డ్- సికింద్రాబాద్ ( రైలు నంబర్ 12703) మూడు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరనుంది. శనివారం ఉదయం 8.35 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలును ఉదయం 11.35 గంటలకు రీషెడ్యూల్ చేశారు. భువనేశ్వర్- ముంబయి సీఎస్ఎంటీ(11020) రైలు కూడా మూడు గంటలు ఆలస్యంగా నడవనుంది. సాధారణంగా మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరనుంది. త్రివేండ్రం-సికింద్రాబాద్ (17229) రైలు 2 గంటలు ఆలస్యం కానుంది. ఉదయం 6.45 గంటలకు బయల్దేరే ఈ రైలు శనివారం (మే 20న) ఉదయం 8.45 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 11.20 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం-ముంబయి ఎల్టీటీ (18519) రైలు గంట ఆలస్యంగా అర్ధరాత్రి 12.20 నిమిషాలకు బయల్దేరుతుంది. ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్ -మన్మాడ్ (17064) రైలు 3 గంటలు ఆలస్యంగా రాత్రి 9.50గంటలకు బయల్దేరనుంది. ప్ర‌యాణికులు ఈ మార్పుల‌ను గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని రైల్వే అధికారులు ఆ ప్ర‌క‌ట‌న‌లో విజ్ఞ‌ప్తి చేశారు.

First Published:  19 May 2023 2:49 AM GMT
Next Story