Telugu Global
Telangana

సత్యమేవ జయతే.. హరీష్‌ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పాలన ప్రతిష్టను మసకబార్చేందుకు ఇటీవల శ్వేతపత్రం రిలీజ్ చేసినట్లు ఫోర్బ్స్‌ రిపోర్టు ద్వారా రుజువైందన్నారు హరీష్‌ రావు.

సత్యమేవ జయతే.. హరీష్‌ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని అధికార కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఫోర్బ్స్‌ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టుపై మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు.


ఫోర్బ్స్‌ రిపోర్టు ప్రకారం.. తెలంగాణ అప్పులు GSDPలో 23.8 శాతం మాత్రమేని చెప్పింది. GSDPలో అతి తక్కువ శాతం అప్పులు ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటన్నారు హరీష్‌ రావు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ రిపోర్టు స్పష్టం చేసిందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పాలన ప్రతిష్టను మసకబార్చేందుకు ఇటీవల శ్వేతపత్రం రిలీజ్ చేసినట్లు ఫోర్బ్స్‌ రిపోర్టు ద్వారా రుజువైందన్నారు హరీష్‌ రావు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ, దాని సోషల్‌మీడియా, యూట్యూబర్‌లు చేస్తున్న ప్రచారం ఫేక్‌ అని తేలిపోయిందన్నారు. సత్యమే గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు హరీష్‌ రావు.

First Published:  22 Feb 2024 5:44 PM GMT
Next Story