Telugu Global
Telangana

సద్దాం హుస్సేన్ కుమారుడు మళ్ళీ పుట్టాడు...బండి సంజయ్ కుమారుడి పై ఆర్జీవీ వ్యాఖలు

బండి భగీరథ్ ఓ విద్యార్థిని కొడుతున్న వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ, భగీరథ్ ను సద్దాం హుస్సేన్ కొడుకుతో పోల్చాడు.

సద్దాం హుస్సేన్ కుమారుడు మళ్ళీ పుట్టాడు...బండి సంజయ్ కుమారుడి పై ఆర్జీవీ వ్యాఖలు
X

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కాలేజ్ లో ఓ విద్యార్థిపై దాడి చేసిన సంఘటన చర్చనీయాంశమైంది. బండి సంజయ్ తన కుమారుడిని సమర్ధించుకుంటూ ప్రకటనలు చేయడంతో ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి. మరో వైపు బండి భగీరథ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలకు పేరు గాంచిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బండి భగీరథ్ ఓ విద్యార్థిని కొడుతున్న వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ, భగీరథ్ ను సద్దాం హుస్సేన్ కొడుకుతో పోల్చాడు.

''ఇరాక్ నియంత సద్దాం కుమారుడు ఉదయ్ హుస్సేన్ వంటి రోజులు ముగిశాయని నేననుకున్నా కానీ ఆయన‌ ఇప్పుడు పునర్జన్మ పొందాడని నేను అనుకుంటున్నాను.బండి సంజయ్ కొడుకు భగీరథ్ తన తండ్రిని మించిన కొడుకు'' అని ఆర్జీవీ ఎగతాళి చేశాడు.

రాంగోపాల్ వర్మ ట్వీట్ పై నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బండి భగీరథ్ పై, అతన్ని సమర్దిస్తున్న బండి సంజయ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

First Published:  18 Jan 2023 5:29 AM GMT
Next Story