Telugu Global
Telangana

రైతుబంధు: 60.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5,801 కోట్లు జమ

రాష్ట్రంలోని దాదాపు 60.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో గురువారం విడుదల చేసిన రూ.482.32 కోట్లతో కలిపి మొత్తం రూ.5,801 కోట్లు జమ చేయబడ్డాయి.

రైతుబంధు: 60.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5,801 కోట్లు జమ
X

రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 60.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో గురువారం విడుదల చేసిన రూ.482.32 కోట్లతో కలిపి మొత్తం రూ.5,801 కోట్లు జమ చేయబడ్డాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పన్నుల భారం మోపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం సహకారం లేదన్నారు. దానికి బదులు రాష్ట్రానికి నిధుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు అధికారం, ప్రసంగాలపైనే ఆసక్తి ఉందని, సిద్ధాంతాలు, నైతికత కొరవడిందని అన్నారు.

First Published:  13 Jan 2023 3:01 AM GMT
Next Story