Telugu Global
Telangana

ఇవాళ ఢిల్లీకి రేవంత్‌.. అభ్యర్థుల ఎంపిక తుదిదశకు..?

ఈ సమావేశంలో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌.. మరో 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఇవాళ ఢిల్లీకి రేవంత్‌.. అభ్యర్థుల ఎంపిక తుదిదశకు..?
X

సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీలో మెంబర్‌గా ఉన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తారు.

ఈ సమావేశంలో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌.. మరో 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. భువనగిరి, కరీంనగర్‌, నిజామాబాద్, వరంగల్‌, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్‌, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

17 పార్లమెంట్ స్థానాల్లో 12 నుంచి 14 స్థానాల్లో పాగా వేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు.

First Published:  27 March 2024 5:16 AM GMT
Next Story