Telugu Global
Telangana

రాష్ట్ర ప్రజలకు రేవంత్ బహిరంగ లేఖ

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

రాష్ట్ర ప్రజలకు రేవంత్ బహిరంగ లేఖ
X

తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగే ప్రమాణస్వీకారానికి ప్రజలంతా రావాలని లేఖలో కోరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందన్నారు.


హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం స్టేడియంలో మూడు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదికపై సీఎం, ఎమ్మెల్యేలు ఉండనున్నారు. రెండో వేదికపై ఏఐసీసీ అగ్రనేతలు, వీఐపీలు ఉంటారు. ఇక స్టేడియం చుట్టుపక్కలా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు రానుండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు.

First Published:  6 Dec 2023 12:40 PM GMT
Next Story