Telugu Global
Telangana

దిక్కులేని వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలోకే వస్తారు : మాజీ ఎంపీ రేణుకా చౌదరి

రేవంత్ రెడ్డి యాత్ర తప్పకుండా సక్సెస్ అవుతుందని అన్నారు. ఆయన ఖమ్మం వస్తే భారీ ఆహ్వానం పలుకుతామని, ఓ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని తెలిపారు.

దిక్కులేని వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలోకే వస్తారు : మాజీ ఎంపీ రేణుకా చౌదరి
X

ఎక్కడా దిక్కులేని వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలోకే వస్తారని, ఎవరు వచ్చినా స్వాగతిస్తామని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుగా చౌదరి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారనే వార్తల నేపథ్యంలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదని తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ ఠాక్రే చూసుకుంటారని స్పష్టం చేశారు.

పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని రేణుకా చౌదరి అన్నారు. గతంలో కాంగ్రెస్ టికెట్లపై గెలిచి, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వస్తారో చూస్తామని అన్నారు. నేను రాబోయే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తా.. పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు లోక్‌సభ అభ్యర్థిత్వంపై ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. గుడివాడ నుంచి కూడా చాలా మంది పోటీ చేయమని అడుగుతున్నారని.. అవసరమైతే రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డి యాత్ర తప్పకుండా సక్సెస్ అవుతుందని అన్నారు. ఆయన ఖమ్మం వస్తే భారీ ఆహ్వానం పలుకుతామని, ఓ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని తెలిపారు. రేవంత్ అనుకున్న వెంటనే పాదయాత్ర స్టార్ట్ చేశారు. మిగిలిన నాయకులు పాదయాత్ర ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నానని వెటకారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో గండవలు చూసి తాను సిగ్గు పడుతున్నారని రేణుక అన్నారు. చివరకు ఏఐసీసీ ఇంచార్జి వచ్చి సెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధకరమని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంలో సీబీఐ విచారణ మంచిదే అని తెలిపారు. హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు.

First Published:  6 Feb 2023 10:31 AM GMT
Next Story