Telugu Global
Telangana

రెండు సీట్లు కావాలి.. కాంగ్రెస్‌ ముందు రాజగోపాల్‌ రెడ్డి ప్రతిపాదన.!

బీజేపీలో ఉన్నప్పుడు కూడా కోమటిరెడ్డి రెండు స్థానాలు కోరినట్లు వార్తలు వచ్చాయి. మునుగోడుతో పాటు ఎల్బీనగర్ స్థానాలను కోరినట్లు ప్రచారం జరిగింది.

రెండు సీట్లు కావాలి.. కాంగ్రెస్‌ ముందు రాజగోపాల్‌ రెడ్డి ప్రతిపాదన.!
X

బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆ పార్టీ హైకమాండ్‌ ముందు కొత్త ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. తనకు రెండు సీట్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మునుగోడుతో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లోనూ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రతిపాదనపై స్పందించిన కేసీ వేణుగోపాల్‌.. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చకు పెడతామని చెప్పినట్లు సమాచారం.

ఇక బీజేపీలో ఉన్నప్పుడు కూడా కోమటిరెడ్డి రెండు స్థానాలు కోరినట్లు వార్తలు వచ్చాయి. మునుగోడుతో పాటు ఎల్బీనగర్ స్థానాలను కోరినట్లు ప్రచారం జరిగింది. మునుగోడులో ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష్మిని బరిలో నిలిపి.. తాను ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరిగినప్పటికీ.. బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో కోమటిరెడ్డి పేరు కనిపించలేదు.

అయితే ఇప్పుడు కోమటిరెడ్డి ప్రతిపాదనపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇక గజ్వేల్ స్థానానికి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ నుంచి తూంకుంట నర్సారెడ్డి బరిలో నిలుస్తున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఇక కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. అయితే కామారెడ్డిలో కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

First Published:  25 Oct 2023 10:25 AM GMT
Next Story