Telugu Global
Telangana

మేం అధికారంలోకి రాగానే పోలీసులతో బాత్ రూం లు కడిగిస్తా -రాజాసింగ్

తెలంగాణ పోలీసులపై, మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్షలు చేశారు. తాము అధికారంలోకి రాగానే పోలీసులతో బాత్ రూం లు కడిగిస్తామంని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మేం అధికారంలోకి రాగానే పోలీసులతో బాత్ రూం లు కడిగిస్తా -రాజాసింగ్
X

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ పోగ్రాం కు పోలీసులు సెక్యూరిటీ కల్పించడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తమ కార్యకర్తలను అరెస్టులు చేసిన పోలీసులపై చర్యలు తీసుంటామన్నారు.

ఒక్క సంవత్సరం ఆగండి మేం అధికారంలోకి వస్తాం.అప్పుడు ఇదే పోలీసులతో, ఇదే కమిషనర్ తో, ఇదే డీజీపీ తో బాత్ రూం లు కడిగిపిస్తాం అని రాజా సింగ్ ఓ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.

మునావర్ ఫారూఖీ పోగ్రాంను ప్రతి రాష్ట్రం రద్దు చేస్తున్నదని తెలంగాణలో మాత్రం రాముడి వ్యతిరేక ప్రభుత్వం ఆయన‌కు ప్రొటెక్షన్ కల్పిస్తోందని రాజాసింగ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఎమ్ ఐ ఎమ్ కోసం మునావర్ ఫరూఖీని అనుమతించాడని, ఇక్కడ హిందూ వ్యతిరేక పాలన నడుస్తోందని రాజా సింగ్ ఆరోపించారు.

కామెడీ షోలంటే కేటీఆర్ కు అంత ఇష్టమైతే ఇక్కడ కామెడీలు చేసేవాళ్ళు లేరా ? నేను కూడా కామెడీ చేస్తా అయితే మునావర్ ఫారూఖీ నమ్మే దేవుడిపై కామెడీ చేస్తా అనుమతిస్తారా అని రాజా సింగ్ ప్రశ్నించారు. ఈ రోజు మీది. ఒక్క ఏడాది ఆగండి మారాజ్యం వస్తుంది అప్పుడు చూపిస్తాం మేమంటే ఏంటో అని రాజాసింగ్ అన్నారు.

First Published:  20 Aug 2022 1:39 PM GMT
Next Story