Telugu Global
Telangana

బీఆర్‌ఎస్‌లో చేరిన‌ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఎన్సీపీ నేతలు

సామాజిక కార్యకర్త అయిన గున్వంతరావు వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేస్తున్నారు. NCP అభ్యర్థిగా, అతను 2009లో ఉద్గీర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో లాతూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో గున్వంతరావు దాదాపు నాలుగు లక్షల ఓట్లను సాధించారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన‌ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఎన్సీపీ నేతలు
X

మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లాతూర్ జిల్లాకు చెందిన కామంత్ మచింద్ర గున్వంతరావు శనివారం బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితిలో చేరారు.

సామాజిక కార్యకర్త అయిన గున్వంతరావు వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేస్తున్నారు. NCP అభ్యర్థిగా, అతను 2009లో ఉద్గీర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో లాతూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో గున్వంతరావు దాదాపు నాలుగు లక్షల ఓట్లను సాధించారు.

పార్టీ వర్గాల ప్రకారం, గున్వంతరావు విద్యార్థి దశలోనే SFI నాయకుడిగా అనేక ఆందోళనలు, ప్రజల సమస్యలపై పోరాడారు. అతనితో పాటు, రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన ఎన్‌సిపి నాయకుడు రాహుల్ ఎస్ సాల్వి, మహద్ తాలూకాకు చెందిన సిద్ధార్థ్ హేట్, రాయగడ్ నుండి ప్రకాష్ కె తొంబరే, మునాఫ్ అమీర్ అధికారి, దక్షిణ ముంబైకి చెందిన దేవేంద్ర సోలంకీ కూడా శనివారం బిఆర్‌ఎస్‌లో చేరారు, వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి స్వాగతించారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు మాణిక్‌ కదమ్‌, శంకరన్న డోంగే తదితరులు పాల్గొన్నారు.

First Published:  7 May 2023 2:24 AM GMT
Next Story