Telugu Global
Telangana

మల్కాజ్ గిరి ఎంపీ మిస్సింగ్..!

తాజాగా కంటోన్మెంట్ ప్రాంతంలోని కార్ఖానాలో విక్రంపురి బస్టాండ్ లో మల్కాజ్ గిరి ఎంపీ మిస్సింగ్ అంటూ పోస్టర్లు వేశారు.

మల్కాజ్ గిరి ఎంపీ మిస్సింగ్..!
X

మల్కాజ్ గిరి ఎంపీ మిస్సింగ్ అంటూ హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈరోజు పోస్టర్లు కనపడ్డాయి. ఆ పోస్టర్లపై ఎంపీ రేవంత్ రెడ్డి బొమ్మకూడా వేశారు. 2020 హైదరాబాద్ వరదల సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడ..? 2023 ప్రస్తుత వరదల సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడ..? అంటూ ప్రశ్నించారు. ఈ పోస్టర్లు వేసింది ఎవరనేది తేలలేదు కానీ.. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలైంది.

రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీ. లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన నియోజకవర్గంలో చాలా తక్కువసార్లు పర్యటించారనే అపవాదు ఉంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలతో బిజీ అయ్యారు. దీంతో ఆయన కంటోన్మెంట్ ప్రాంతంలో పర్యటించడంలేదని స్థానికులు అంటున్నారు.

తాజాగా కంటోన్మెంట్ ప్రాంతంలోని కార్ఖానాలో విక్రంపురి బస్టాండ్ లో మల్కాజ్ గిరి ఎంపీ మిస్సింగ్ అంటూ పోస్టర్లు వేశారు. వర్షాలతో నగర ప్రజలు ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి పరామర్శకు రాలేదంటూ ఈ పోస్టర్లు వేశారు. వీటిపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు వైరి వర్గాలు ఇలా ఆరోపణలు చేస్తున్నాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. హైదరాబాద్ లో పోస్టర్ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.

First Published:  29 July 2023 8:23 AM GMT
Next Story