Telugu Global
Telangana

మాధవీలతపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..!

శ్రీరామనవమి రోజు నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు మాధవీలత. ఆ యాత్ర సిద్ధి అంబర్ బజార్‌ సర్కిల్‌కు చేరుకోగానే.. అక్కడున్న ఓ మత కట్టడాన్ని టార్గెట్ చేసి బాణం ఎక్కుపెట్టినట్లుగా పోజు ఇచ్చారు.

మాధవీలతపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..!
X

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు షాకిచ్చారు పోలీసులు. ఇటీవల ఓ వర్గం మనోభావాలను గాయపరిచేలా వ్యవహరించారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. మాధవీలతపై ఐపీసీ సెక్షన్ 295/A ( ఉద్దేశపూర్వకంగా ఓ వర్గం మనోభావాలను కించపరిచేలా వ్యవహారించడం) కింద బేగంబజార్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

శ్రీరామనవమి రోజు నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు మాధవీలత. ఆ యాత్ర సిద్ధి అంబర్ బజార్‌ సర్కిల్‌కు చేరుకోగానే.. అక్కడున్న ఓ మత కట్టడాన్ని టార్గెట్ చేసి బాణం ఎక్కుపెట్టినట్లుగా పోజు ఇచ్చారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఇక ఆ పోజుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం మాధవీలత చర్యలపై మండిపడ్డారు. మాధవీలత చర్యలు ఈసీకి, పోలీసులకు కనిపించడం లేదా అంటూ ఫైర్ అయ్యారు.

First Published:  21 April 2024 5:43 PM GMT
Next Story