Telugu Global
Telangana

తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు : మంత్రి హరీశ్ రావు

గోబెల్స్ ప్రచారంలో కాంగ్రెస్‌కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని.. కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీనే సర్వేలు సృష్టించుకుంటుందని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు : మంత్రి హరీశ్ రావు
X

అసెంబ్లీ ఎన్నికల బరిలో తెలంగాణ ద్రోహులు ఒకవైపు, తెలంగాణవాదులు మరోవైపు ఉండి యుద్ధం చేస్తున్నారు. వామపక్ష పార్టీలపై తమకు ఇంకా గౌరవం ఉందని.. ఆ పార్టీలను కాంగ్రెస్ మోసం చేసిందని హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని.. సమర్థ నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం కోసం మళ్లీ కేసీఆర్‌నే గెలిపించుకుంటారని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

గోబెల్స్ ప్రచారంలో కాంగ్రెస్‌కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని.. కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీనే సర్వేలు సృష్టించుకుంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ఎన్నికల పొత్తులే వారి బలహీనతను బయడపెడుతున్నాయని.. అదే బీఆర్ఎస్ బలానికి నిదర్శనమని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణలో హంగ్ రావాలని కొంత మంది ఆశిస్తున్నారు. వారికి నిరాశే మిగులుతుందని పరోక్షంగా బీజేపీని విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బుదర చల్లే ప్రయత్నం చేస్తారని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. అందుకోసమే మేడిగడ్డ బ్యారేజ్ నివేదికను హడావిడిగా తెప్పించుకున్నారని ఆరోపించారు. ఒక బ్యారేజీలో ఒక పిల్లరు పోతే.. మొత్తం కాళేశ్వరమే కుంగిపోయినట్లు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక కేవలం ఎన్నికల కోణంలోనే ఉన్నట్లు కనపడుతుందని.. ఇది కచ్చితంగా రాజకీయంగా బురద చల్లే కుట్రలో భాగమే అని ఆరోపించారు. ప్రధాని మోడీ గల్లీ లీడర్ స్థాయికి దిగి.. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ తన వద్దకు వచ్చాడని చెప్పడం హాస్యాస్పదం అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.


First Published:  7 Nov 2023 6:15 AM GMT
Next Story