Telugu Global
Telangana

'దుర్మార్గుల చివరి ఆయుధం దేశ‌భక్తే'...ఈ కామెంట్ ఎవరి గురించో ఊహించండి -కేటీఆర్

''అదానీ స్కాం, హిండెన్ బర్గ్ నివేదికపై మాట్లాడే దమ్ము లేదు కానీ జార్జ్‌ సోరోస్ కామెంట్లు చేయగానే వాళ్ళ బాస్ ను రక్షించుకునేందుకు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఎంత దయనీయమైన పరిస్థితి. వాళ్ళది ఎంత దివాళాకోరు తనం'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

దుర్మార్గుల చివరి ఆయుధం దేశ‌భక్తే...ఈ కామెంట్ ఎవరి గురించో ఊహించండి -కేటీఆర్
X

''అదానీ స్కాం, హిండెన్ బర్గ్ నివేదికపై మాట్లాడే దమ్ము లేదు కానీ జార్జ్‌ సోరోస్ కామెంట్లు చేయగానే వాళ్ళ బాస్ ను రక్షించుకునేందుకు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఎంత దయనీయమైన పరిస్థితి. వాళ్ళది ఎంత దివాళాకోరు తనం'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేంద్ర బీజేపీ సర్కార్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్ష విమర్శలతో ట్వీట్ చేశారు. అదానీ స్కాంపై హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో మోడీని విమర్శిస్తూ అమెరికన్ బిలియనీర్ జార్జ్‌ సోరోస్‌ చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు ఉలిక్కి పడటాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన చేసిన ట్వీట్ లో...

''అదానీ స్కాం, హిండెన్ బర్గ్ నివేదికపై మాట్లాడే దమ్ము లేదు కానీ జార్జ్‌ సోరోస్ కామెంట్లు చేయగానే వాళ్ళ బాస్ ను రక్షించుకునేందుకు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఎంత దయనీయమైన పరిస్థితి. వాళ్ళది ఎంత దివాళాకోరు తనం'' అని ట్వీట్ చేసిన కేటీఆర్ నేను ''ఈ కామెట్లు ఎవరి గురించి చేశానో ఊహించండి'' అని నెటిజనులను ప్రశ్నించారు.

ఈ ట్వీట్ కు 'దుర్మార్గుల చివరి ఆయుధం దేశ‌భక్తే’ అన్న సామ్యేల్‌ జాన్సన్‌ సూక్తిని జతచేశారు.

First Published:  19 Feb 2023 1:25 PM GMT
Next Story