Telugu Global
Telangana

పార్లమెంట్ లో కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయాలి -BRSఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం

కేంద్రం అసమర్థతను దేశం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తెలంగాణతో పాటు దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ముఖ్యమంత్రి, అన్ని ప్రజాస్వామిక మార్గాలను ఉపయోగించుకోవాలని ఎంపీలకు సూచించారు.

పార్లమెంట్ లో కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయాలి -BRSఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
X

కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల వల్ల దేశ పరిస్థితులు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు సూచించారు.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వివాదం నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు జాతీయ సమగ్రత, అభివృద్ధికి ముప్పు కలిగిస్తున్నాయని అన్నారు.

"మేము దీన్ని ఇకపై అనుమతించలేము" అని కేసీఆర్ అన్నారు, ఇప్పటికే ఈ కంపెనీలు పొందుతున్న లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి, ప్రజలు కష్టపడి సంపాదించిన పొదుపులను కేంద్రం తన స్నేహపూర్వక-కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నదని ఎత్తి చూపారు. ఎల్‌ఐసి వంటి సంస్థల ద్వారా బిజెపికి అనుకూలమైన కార్పొరేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించడం,లేదా రుణాలు ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేయడ‍ం కేంద్రం చేస్తున్నదని కేసీఆర్ మండిపడ్డారు.

ఆదివారం ప్రగతి భవన్‌లో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి, ఈ కంపెనీలు తమ షేర్ల ధరలు ఆకస్మిక పతనంతో రోజూ లక్షల కోట్ల రూపాయలను నష్టపోతున్నాయని అన్నారు.

"ఇటువంటి ఆర్థిక అవకతవకలకు దోహదపడేలా, కేంద్రం దేశ సంపదను ప్రైవేటీకరించి, దేశానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తోంది" అని ఆయన అన్నారు, కేంద్ర ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఉభయ సభలలో తమ గళాన్ని వినిపించాలని BRS MPలను కోరారు. బీజేపీ ప్రభుత్వం నష్టాలను జాతీయకరించి లాభాలను ప్రైవేటీకరించిందని, దీనిని పార్లమెంటులో ప్రశ్నించాలని పునరుద్ఘాటించారు.

కేంద్రం అసమర్థతను దేశం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తెలంగాణతో పాటు దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ముఖ్యమంత్రి, అన్ని ప్రజాస్వామిక మార్గాలను ఉపయోగించుకోవాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం అప్రజాస్వామిక నిర్ణయాలు. జాతీయ సమస్యలపై బిజెపిని ఎదుర్కోవడానికి ఉభయసభల్లో ప్రతిపక్షాల నుండి మద్దతు తీసుకోవాలని వారిని కోరారు కేసీఆర్.

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరిగాయని గుర్తు చేసిన ఆయన, దేశవ్యాప్తంగా పేదలపై తాజా పన్నులు, ద్రవ్యోల్బణంతో భారం మోపుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల కష్టాలను ఉభయ సభల్లో ప్రస్తావనకు తీసుకురావాలన్నారు.

నిరుద్యోగం అసాధారణంగా పెరిగిపోతున్నప్పటికీ, దేశంలోని యువతను కేంద్రం విస్మరిస్తోందని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమైందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ రంగ యూనిట్లు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం ఈ దేశానికి చాలా నష్టకరమన్నారు కేసీఆర్. బీఆర్‌ఎస్ ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి కేంద్రాన్ని నెరవేర్చని హామీలపై ప్రశ్నించాలని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనపై కేసీఆర్ మాట్లాడుతూ సమాఖ్య స్ఫూర్తిని అణగదొక్కడం, అనేక రాష్ట్రాల్లో పెను సంక్షోభాన్ని రేకెత్తించే నిర్ణయాలపై బడ్జెట్ సమావేశంలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బిఆర్ఎస్ ఎంపిలను కోరారు.

రాష్ట్రాలను అప్రజాస్వామికంగా నిర్వీర్యం చేసేందుకు కేంద్రం గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఎత్తి చూపిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయడానికి, వాటి పురోగతికి అడ్డంకులు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తుందో కూడా ఎంపీలు ఎత్తి చూపాలని కోరారు.

రాజ్యాంగ విధులను నిర్వర్తించడం ద్వారా కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధులుగా కాకుండా, రాష్ట్రాలపై రాజకీయ ప్రేరేపిత చర్యలకు గవర్నర్‌లను ఉపయోగిస్తున్నారు. కేబినెట్, శాసనసభ, మండలితో సహా రాష్ట్రంలోని అత్యున్నత సంస్థలు తీసుకున్న నిర్ణయాలను గవర్నర్లు గౌరవించడం లేదని, వాటిని పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆయన అన్నారు.

First Published:  30 Jan 2023 1:17 AM GMT
Next Story