Telugu Global
Telangana

హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి... పరిపూర్ణానందస్వామి వివాదాస్పద‌ వ్యాఖ్యలు

హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులివ్వాలని పరిపూర్ణానందస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. హిందువులుగా జీవించే వారికి, హిందువులు కాకున్నా హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలన్నారు.

హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి... పరిపూర్ణానందస్వామి వివాదాస్పద‌ వ్యాఖ్యలు
X

పరిపూర్ణానంద స్వామి గుర్తున్నారు కదా ! గత అసెంబ్లీ ఎనికలకు సరిగ్గా నెల రోజుల ముంది బీజేపీ తరపున రంగంలోకి దిగి రాష్ట్ర మంతా ప్రచారం చేశారు. బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం కూడా జరిగింది. అన్నట్టు ఈ యన ఓ టీవీ ఛానల్ కూడా పెట్టారు. ఎందుకో కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆయన నిన్న జగిత్యాలకు వెళ్ళారు. జగిత్యాలలో నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఆయన అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. హిందువులుగా జీవించే వారికి, హిందువులు కాకున్నా హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలన్నారు. జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని, అందుకనే ఇక్కడ చెబుతున్నట్టు పేర్కొన్నారు.

''మిగతావారికి ఆధార్ ఇవ్వద్దు. ఇక వాళ్ళంతా ఆఫ్టనిస్తాన్ వెళ్తారో, పాకిస్తాన్ వెళ్తారో , బంగ్లాదేశ్ కు వెళ్తారో , బాయిలో దూకుతారో వారిష్టం అంతేకానీ వారికి మాత్రం ఆధార్ కార్డు లేదు.ఈ దేశంలో వారికి స్థానం లేదు.'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పరిపూర్ణానంద.

First Published:  4 April 2023 2:58 AM GMT
Next Story