ఒక్క రైతు చనిపోలేదు.. కేసీఆర్ కామెంట్స్పై ఉత్తమ్
తెలంగాణలో ఇప్పటివరకూ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు ఉత్తమ్. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆరే కోరుకుంటున్నట్లు ఉందన్నారు.
![ఒక్క రైతు చనిపోలేదు.. కేసీఆర్ కామెంట్స్పై ఉత్తమ్ ఒక్క రైతు చనిపోలేదు.. కేసీఆర్ కామెంట్స్పై ఉత్తమ్](https://www.teluguglobal.com/h-upload/2024/04/06/1316795-not-a-single-farmer-died-minister-uttam-kumar-reddys-reaction-on-kcrs-comments.webp)
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకూ 209 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలతో ఓ లిస్టును సైతం బీఆర్ఎస్ సిద్ధం చేసింది.
అయితే తాజాగా ఈ అంశంపై స్పందించారు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి. తెలంగాణలో ఇప్పటివరకూ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు ఉత్తమ్. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆరే కోరుకుంటున్నట్లు ఉందన్నారు. రైతులను ఆత్మహత్యలవైపు కేసీఆర్ ఉసిగోల్పుతున్నారని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
VIDEO | Here’s what Telangana Minister and Congress leader Uttam Kumar Reddy (@UttamINC) said on BRS chief K Chandrashekar Rao’s allegation of artificial drought in the state.
— Press Trust of India (@PTI_News) April 6, 2024
“I would like to put this on record that not even a single farmer has committed suicide in Telangana.… pic.twitter.com/ooFFG07jdB
కేసీఆర్, ఆయన పార్టీ ఉనికి కోసం పాకులాడుతోందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్నారు ఉత్తమ్. రాజకీయ ఉనికి ఉండదనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారన్నారు. తన వైఫల్యాలకు కేసీఆర్ కాంగ్రెస్ను నిందిస్తున్నారని విమర్శించారు.