Telugu Global
Telangana

ఉప్పల్ లో మొదలైన న్యూజిలాండ్, భారత్ తొలి వన్డే.... టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ సందర్భంగా టీం లో భారత్‌ మూడు మార్పులు చేసింది.

ఉప్పల్ లో మొదలైన న్యూజిలాండ్, భారత్ తొలి వన్డే.... టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
X

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ సందర్భంగా టీం లో భారత్‌ మూడు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ కూడా తిరిగి వచ్చారు. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ జట్టులోకి వచ్చారు.

ఇండియా తుది జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ తుది జట్టుI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (క్యాప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

First Published:  18 Jan 2023 8:24 AM GMT
Next Story