Telugu Global
Telangana

రాజాసింగ్ శోభాయాత్రలో గాడ్సే నే రాముడు!

హైదరాబాద్ లో, వివాదాస్పద నాయకుడు,బీజేపీ బహిష్కృత నేత, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతి సారి లాగానే ఈ సారి కూడా భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఆయన నిర్వహించిన శోభాయాత్రలో ఆయన అనుచరులు మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఫోటోలను ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేశారు.

రాజాసింగ్ శోభాయాత్రలో గాడ్సే నే రాముడు!
X

శ్రీరామనవమి సందర్భంగా నిన్న ఒకరికి మించి ఒకరు పెద్ద ఎత్తున శోభాయాత్రలు నిర్వహించారు. బీజేపీ, ఆరెస్సెస్, ఇతర హిందుత్వ సంఘాలు వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీలు చేశాయి. కొన్ని చోట్ల ఇతర మతాల వారితో ఘర్షణల‌కు కూడా దిగారు. ఈ శోభాయాత్ర‌లను అనేక చోట్ల బీజేపీ తన ప్రచార యాత్రలుగా మార్చింది.

హైదరాబాద్ లో, వివాదాస్పద నాయకుడు,బీజేపీ బహిష్కృత నేత, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతి సారి లాగానే ఈ సారి కూడా భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఆయన నిర్వహించిన శోభాయాత్రలో ఆయన అనుచరులు మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఫోటోలను ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేశారు.

దూల్‌పేట్ లోని హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజాసింగ్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు పాల్గొన్నారు. అయితే ఆయన అనుచరులు జైశ్రీరామ్ అనే జెండాలతో పాటు నాథూరామ్ గాడ్సే ఫొటోను ప్రదర్శించారు. గాడ్సే ఫోటోలు పట్టుకొని ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.

మహాత్ముని హంతకుడి ఫోటోలతో ఊరేగింపు తీసిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీనిపై నెటిజనులు అనేక రకాలుగా స్పంధిస్తున్నారు. పలువురు దీన్ని ఖండిస్తుండగా , మరి కొంతమంది హిందుత్వ వాదులుమాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు. చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.


First Published:  31 March 2023 5:30 AM GMT
Next Story