Telugu Global
Telangana

వెంకటేష్, రానాలకు కోర్టు షాక్‌

హోటల్‌ను ధ్వంసం చేసేందుకు 60 మంది ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకున్నారని, వారి ద్వారా హోటల్‌ను ధ్వంసం చేశారని నందకుమార్‌ తెలిపారు.

వెంకటేష్, రానాలకు కోర్టు షాక్‌
X

టాలీవుడ్ స్టార్‌ హీరోలు.. బాబాయ్, అబ్బాయ్‌లు.. వెంకటేష్, రానాలకు న్యాయస్థానం షాకిచ్చింది. వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్‌ డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేత ఘటనలో దాని యజమాని నందకుమార్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ కేసుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన భవనాన్ని ధ్వంసం చేసి, ఫర్నిచర్‌ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఆయన న్యాయస్థానానికి వివరించారు.

హోటల్‌ను ధ్వంసం చేసేందుకు 60 మంది ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకున్నారని, వారి ద్వారా హోటల్‌ను ధ్వంసం చేశారని నందకుమార్‌ తెలిపారు. దీనివల్ల తనకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో వెంకటేష్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులైన సురేష్, రానా, అభిరామ్‌లపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

First Published:  29 Jan 2024 8:15 AM GMT
Next Story