Telugu Global
Telangana

కోమటిరెడ్డి అనుచరులు జైలుకెళ్లడం ఖాయం..!

న్యాయబద్ధంగా చట్టపరంగా కోర్టుకు వెళ్లి కోమటిరెడ్డి అనుచరులకు శిక్షపడేలా చేస్తానన్నారు భూపాల్ రెడ్డి. దానికి తగ్గ సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వాటిని బయటపెడితే, రాజకీయ కక్ష సాధింపులని చెప్పి సింపతీ కోసం ప్రయత్నిస్తారని, అందుకే ఆ సాక్ష్యాలను బయటపెట్టడం లేదన్నారు.

కోమటిరెడ్డి అనుచరులు జైలుకెళ్లడం ఖాయం..!
X

నల్లగొండలో అక్రమంగా భూములు కబ్జాలు చేసిన కోమటిరెడ్డి అనుచరులు జైలుకెళ్లడం ఖాయం అంటున్నారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుచరులుగా ఉన్న గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి.. వక్ఫ్ బోర్డ్ స్థలాలు, దళితుల భూములు, ఇతర ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చెప్పారు. సర్వే నెంబర్లు కూడా మార్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే వారందరూ జైలుకెళ్లడం ఖాయమన్నారు.

న్యాయబద్ధంగా చట్టపరంగా కోర్టుకు వెళ్లి కోమటిరెడ్డి అనుచరులకు శిక్షపడేలా చేస్తానన్నారు భూపాల్ రెడ్డి. దానికి తగ్గ సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వాటిని బయటపెడితే, రాజకీయ కక్ష సాధింపులని చెప్పి సింపతీ కోసం ప్రయత్నిస్తారని, అందుకే ఆ సాక్ష్యాలను బయటపెట్టడం లేదన్నారు. కనీసం 10,000 మందితో సభ పెట్టలేని కోమటిరెడ్డి తనపై విజయం సాధిస్తారని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.

కోమటిరెడ్డి వెంట రౌడీలు..

కోమటిరెడ్డి వెంట రౌడీలు తిరుగుతున్నారని చెప్పారు భూపాల్ రెడ్డి. త్వరలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. కిందపడేసి తొక్కుతామంటూ కోమటిరెడ్డి, ఆయన అనుచరులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాల్గొన్న నల్లగొండ సభ సక్సెస్ అయిందని చెబుతున్న ఆయన.. ప్రజామద్దతు బీఆర్ఎస్ కే ఉందని చెప్పారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు.

First Published:  23 Nov 2023 5:53 AM GMT
Next Story