Telugu Global
Telangana

మునుగోడు ఎన్నికలు: బీజేపీ నాయకుని వద్ద కోటి రూపాయలు పట్టివేత!

మునుగోడు ఎన్నికలు: మునుగోడు ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఓ బీజేపీ నాయకుడి వద్ద కోటి రూపాయలు నగదు పట్టుకున్నారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంలో రూ. కోటి రూపాయల నగదు దొరికినట్టు పోలీసులు తెలిపారు.

మునుగోడు ఎన్నికలు
X

మునుగోడు ఎన్నికలు 

మునుగోడు ఉపఎన్నికలో డబ్బుల వరదపారుతోందనే వార్తలు వస్తున్నాయి. పెద్ద నాయకుల నుంచి, చోటా మోటా నాయకుల దాకా లక్షలు వెచ్చించి కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్లకు కూడా వేల రూపాయలు ముట్టజెప్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఓ బీజేపీ నాయకుడి వద్ద కోటి రూపాయలు దొరకడం కలకలం రేగింది.


మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు తీవ్రమైన నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంలో రూ. కోటి రూపాయల నగదు పట్టుబడింది. ఈ నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. బీజేపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


First Published:  17 Oct 2022 11:05 AM GMT
Next Story