Telugu Global
Telangana

బీజేపీ అగ్రనేతలు జగన్‌ను చూసి నేర్చుకోవాలి

భారత రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ నిత్యం వస్తున్న ఆరోపణలపై బీజేపీ వెంటనే స్పందించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

బీజేపీ అగ్రనేతలు జగన్‌ను చూసి నేర్చుకోవాలి
X

బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ప్రాధాన్యత కల్పించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలులోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జగన్‌ను చూసి బీజేపీ అగ్రనేతలు నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. కాచిగూడలో ఆదివారం నిర్వహించిన 13 బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ నిత్యం వస్తున్న ఆరోపణలపై బీజేపీ వెంటనే స్పందించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పర్యటనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. కేంద్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీసీల సంక్షేమానికి ఒక పథకం కూడా ప్రారంభించలేదని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

First Published:  29 April 2024 5:44 AM GMT
Next Story