Telugu Global
Telangana

వచ్చేనెల 13న హైదరాబాద్ కు రానున్న‌ మోడీ...పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగసభ‌

ఈ నెల 19 నే మోడీ హైదరాబాద్ కు రావాల్సి ఉండింది. అయితే అనివార్య కారణాలతో ఆ పర్యటన వాయిదా పడింది. దాంతో 15 వ తేదీన సికిందరాబాద్ నుంచి విశాఖకు వెళ్ళే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ ఢిల్లీ నుంచే వర్చువల్ గా ప్రారంభించారు.

వచ్చేనెల 13న హైదరాబాద్ కు రానున్న‌ మోడీ...పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగసభ‌
X

ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొంటారు.

కాగా ఈ నెల 19 నే మోడీ హైదరాబాద్ కు రావాల్సి ఉండింది. అయితే అనివార్య కారణాలతో ఆ పర్యటన వాయిదా పడింది. దాంతో 15 వ తేదీన సికిందరాబాద్ నుంచి విశాఖకు వెళ్ళే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ ఢిల్లీ నుంచే వర్చువల్ గా ప్రారంభించారు.

మరో వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి రేపటి నుంచి తెలంగాణలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మెదక్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారు. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో 23, 24 తేదీల్లో పరటిస్తారు.

First Published:  21 Jan 2023 9:38 AM GMT
Next Story