Telugu Global
Telangana

మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ ని యశోద ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా అదే ఆస్పత్రిలో చేరడంతో ఆయన్ను పరామర్శించేందుకు కవిత వచ్చారు.

మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనను ఈరోజు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన కవిత కోమటిరెడ్డిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత వైద్యులతో మాట్లాడారు. మంత్రి త్వరగా కోలుకోవాలని కవిత ఆకాంక్షించారు.

ఇటీవలే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడంతోపాటు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలసి వచ్చారు. వచ్చీ రాగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన్ను ఈరోజు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.

ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ ని యశోద ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ లోని ఇతర నాయకులకంటే ముందే ఆయన కేసీఆర్ ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా అదే ఆస్పత్రిలో చేరడంతో ఆయన్ను పరామర్శించేందుకు కవిత వచ్చారు.

First Published:  13 Dec 2023 12:57 PM GMT
Next Story