Telugu Global
Telangana

బండి సంజయ్ ది పాదయాత్ర కాదు..పాదాలకు చెప్పులు మోసే యాత్ర: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

మోడీ పాలనతో విసిగి పోయిన ప్రజలు.. మార్పు కోరుకుంటున్నారని, కేసీఆర్ ఎంట్రీ కోసం వారంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.

బండి సంజయ్ ది పాదయాత్ర కాదు..పాదాలకు చెప్పులు మోసే యాత్ర: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని కంట్రీ మొత్తం వెయిట్ చేస్తోందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశం మొత్తం మీద ఎక్కడ అమలు కావడం లేదని ఆయన చెప్పారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనతో దేశ ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దమ్ముంటే టీఆర్ఎస్ పథకాలను అమలు చేసి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. మోడీ పాలనతో విసిగి పోయిన ప్రజలు.. మార్పు కోరుకుంటున్నారని, కేసీఆర్ ఎంట్రీ కోసం వారంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని అన్నారు.

బీజేపీ రాష్ట్రీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. అది పాదయాత్ర కాదని.. పాదాలకు చెప్పులు మోసే యాత్రని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిమజ్జనం సమయంలో కూడా రాజకీయాలు చేయడం బీజేపీకే చెల్లిందని మండిపడ్డారు. చెప్పులు మోయడం, కేసీఆర్‌ను తిట్టడం తప్ప సంజయ్‌కు మరో పని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా గుజరాత్ మోడల్ కాదు.. కేసీఆర్ మోడల్ కావాలని ఎదురు చూస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నారు.

త్వరలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రజలందరు మెచ్చుకునే పాలన అందిస్తారని జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని నమ్ముకుని దేశ ప్రజలు ఆగం అయ్యారని.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అన్యాయమైన రాజకీయాల చేస్తోంది. అభివృద్ధికి పనికి వచ్చే ఒక్క మాట కూడా మాట్లాదని ఆయన అన్నారు.

First Published:  12 Sep 2022 7:31 AM GMT
Next Story