Telugu Global
Telangana

Hyderabad:పెళ్ళికి నిరాకరించినందుకు యువతిని అత్యాచారం చేసి, హత్యచేసిన‌ దుర్మార్గుడు

హైదరాబాద్ లో మిస్ అయిన సాయిప్రియ అనే యువతి వనపర్తి జిల్లాలో శవంగా బైటపడింది. ఆమె మాజీ ప్రియుడే ఆమెపై అత్యాచారం చేసి , హత్య చేశాడని పోలీసులు తేల్చారు.

Hyderabad:పెళ్ళికి నిరాకరించినందుకు యువతిని అత్యాచారం చేసి, హత్యచేసిన‌ దుర్మార్గుడు
X

ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ లో అదృశ్యమైన సాయిప్రియ అనే యువతి మిస్టరీ వీడింది. ఆమె మాజీ ప్రియుడే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడని తేలిపోయింది.

హైదరాబాద్‌ కాటేదాన్‌లో నివాసముండే సాయిప్రియ ఈ నెల 5న కాలేజీకి వెళ్తున్నాన‌ని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. దాంతో సాయిప్రియ తండ్రి మైలార్ దేవ్ పల్లి పోలీసులకు పిర్యాదు చేశాడు. ఇంతలో, తాను శ్రీశైలం అనే అతన్ని ప్రేమించినా నువ్వు ఒప్పుకోకపోవడంతో తాను వెళ్ళిపోతున్నాఅని ఆమె ఫోన్ నుండి తండ్రికి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ తండ్రికి అనుమానం కలిగించింది.

శ్రీశైలం మీద అనుమానం ఉందని సాయిప్రియ తండ్రి పోలీసులకు చెప్పడంతో పోలీసులు శ్రీశైలం స్వగ్రామమైన వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మం డలం మానాజీపేట గ్రామానికి వెళ్ళి శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బైటపడింది.

సాయిప్రియ , శ్రీశైలం కొంత కాలం ప్రేమించుకున్నారు. తాను శ్రీశైలాన్ని పెళ్ళి చేసుకుంటానని సాయిప్రియ తండ్రికి చెప్పింది. తండ్రి ఒప్పుకోకపోవడంతో సాయిప్రియ తనను మర్చిపొమ్మని శ్రీశైలంను కోరింది. అతనితో మాట్లాడటం మానేసింది. అయినా శ్రీశైలం ఆమెను వేధించడం ఆపకపోవడంతో సాయిప్రియ అతని ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ చేసింది.

అయితే ఆమెతో తిరిగి సంబంధాలను కొనసాగించడానికి శ్రీశైలం మార్గాలు వెతికాడు. చివరకు స్నా ప్‌ చాట్‌ ద్వా రా సాయిప్రియకు టచ్‌లోకి వెళ్లాడు.. మళ్లీ ఆమెను ట్రాప్‌ చేశాడు.. దీం తో

వారి మధ్య మూడు నెలల క్రితం నుం చి మళ్లీ మాటలు మొదలైనట్టుగా తెలుస్తోం ది.. ఒకసారి కలిసి మాట్లాడుకుం దామని శ్రీశైలం చెప్ప డం తో ఈ నెల 5న సాయిప్రియ భూత్పూ ర్‌కు వెళ్లిం ది. అక్క డి నుం చి శ్రీశైలం తన‌ బైక్ పై సాయిప్రియను మానాజీపేటకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఊరికి దూరంగా తీసుకెళ్ళి తనను పెళ్ళి చేసుకొమ్మని అడిగాడు. ఆమె మాత్రం ససేమిరా అంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని, అందువల్ల తనను వదిలేయాలని, తాను పైచదువుల కోసం అమెరికా వెళ్తున్నానని ఆమె బతిమిలాడింది. శ్రీశైలం బెదిరించడం మొదలుపెట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే శ్రీశైలం సాయిప్రియపై అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం ఆమె చున్నీని గొంతుకు భిగించి చంపేశాడు. ఆ తర్వాత తన బావ‌మరిది శివ సహాయంతో కేఎల్ కాల్వ దగ్గర గొయ్యి తవ్వి సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. సాయిప్రియ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి పక్కనే ఉన్న బావిలో పడేశాడు.

సాయి ప్రియ ఫోన్ సిగ్నల్ చివరగా ఆ గ్రామంలో చూపించడంతో సాయి ప్రియ తండ్రికి శ్రీశైలం మీద అనుమానం వచ్చి విషయమంతా బైటపడింది. శ్రీశైలాన్ని, అతనికి సహకరించిన శివను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని, అయితే మరింత విచారణ జరపాల్సిన అవసర‍ ఉన్నందున కోర్టు అనుమతితో మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటామని మైలార్ దేవ్ పల్లి ఇన్ స్పెక్టర్ నర్సింహులు తెలిపారు.

First Published:  10 Sep 2022 1:40 PM GMT
Next Story