Telugu Global
Telangana

కార్పొరేటర్ కి గొడుగు పట్టిన మంత్రి.. ఫొటోలు వైరల్

అధికారంలో ఉన్నవారు చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత హడావిడి చేస్తుంటారో మనం చూస్తూనే ఉంటాం. కానీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటోంది.

కార్పొరేటర్ కి గొడుగు పట్టిన మంత్రి.. ఫొటోలు వైరల్
X

రాజకీయ నాయకులు హోదా, దర్పం ప్రదర్శిస్తుంటారని అనుకుంటారంతా. కానీ కొంతమంది అందుకు మినహాయింపు. అలాంటివారిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకరు. ఆహార్యం ఎంత సింపుల్ గా ఉంటుందో అంతకు మించిన మంచి మనసు ఆమెది. ఎప్పుడూ భేషజాలకు పోరు. అధికార దర్పం ప్రదర్శించరు. అలాంటి ఓ సంఘటన తాజాగా జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బడంగ్ పేట్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ మమత కృష్ణారెడ్డి కూడా ఆమెతోపాటే ఉన్నారు. వరుస కార్యక్రమాలతో అందరూ బిజీగా ఉన్న వేళ, ఉన్నట్టుండి వర్షం పడింది. వెంటనే సిబ్బంది.. అధికారులు, నాయకుల కోసం గొడుగులు తెప్పించారు. మంత్రి సబిత తన గొడుగు తానే పట్టుకున్నారు. ఇతర సిబ్బంది ఎవరికీ ఆ పని పురమాయించలేదు. అంతే కాదు, తన గొడుగులోనే కార్పొరేటర్ మమతకు చోటిచ్చారు. వర్షం హడావిడిలో కార్పొరేటర్ మమత, తనకు గొడుగు పట్టింది మంత్రి అని గుర్తించలేకపోయారు, ఆమె తేరుకుని ఆ గొడుగు చేతిలోకి తీసుకుందామనుకున్నా.. మంత్రి వారించారు. వర్షం పడుతున్నంత సేపు అక్కడ మంత్రి స్వయంగా గొడుగు పట్టుకుని కనిపించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



అధికారంలో ఉన్నవారు చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత హడావిడి చేస్తుంటారో మనం చూస్తూనే ఉంటాం. కానీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటోంది. కార్పొరేటర్ కోసం మంత్రి స్వయంగా గొడుగు పట్టుకోవడం సోషల్ మీడియాలో చర్చకు తావిచ్చింది. మరోసారి మంత్రి సింప్లిసిటీ తెరపైకి వచ్చింది.

First Published:  28 Aug 2023 8:57 AM GMT
Next Story