Telugu Global
Telangana

మల్లారెడ్డి మాస్ ప్రచారం.. వీడియోలు వైరల్

పిల్లలు, పెద్దలు, మహిళలు.. అందరూ ఆయన అభిమానులే. తాజాగా ముసలావిడను మంత్రి మల్లారెడ్డి ఒడిలో కూర్చోబెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మల్లారెడ్డి మాస్ ప్రచారం.. వీడియోలు వైరల్
X

మల్లారెడ్డి మాస్ ప్రచారం.. వీడియోలు వైరల్

పసి బిడ్డ అయినా, పండు ముసలి అయినా.. అందరూ తమకు ఒకటేనంటున్నారు మంత్రి మల్లారెడ్డి. లాలించడం, పాలించడం తమకు తెలుసంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఓ ముసలి అవ్వను ఒడిలో కూర్చోబెట్టుకున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది. పండు ముదుసలిని ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అక్కడున్న నాయకులు పడిపడి నవ్వుకున్నారు.

ఆ ముసలావిడ కూడా మల్లారెడ్డి మళ్లీ గెలవాలని దీవించారు. సామాజిక పెన్షన్లను పెద్ద ఎత్తున పెంచబోతున్నామని.. మళ్లీ గెలిపిస్తే పెన్షన్ 5వేల రూపాయలు చేస్తామని ఆమెతో చెప్పారు మల్లారెడ్డి. కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎం చేయాలన్నారు. పేదలకోసం కష్టపడే ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని కోరారు.

పాలమ్మిన, పూలమ్మిన, కాయకష్టం చేసిన.. అంటూ ఆమధ్య అసెంబ్లీలో మంత్రి మల్లారెడ్డి చెప్పిన మాటలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. అప్పటినుంచి ఆయన సోషల్ మీడియా స్టార్ గా మారిపోయారు. మంత్రి కేటీఆర్ సైతం తన ప్రసంగాల్లో మల్లారెడ్డి మాటల్ని గుర్తు చేస్తుండేవారు. ఇప్పుడు ప్రచారంలో కూడా మల్లారెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఇటీవల తాను పాలమ్మిన పాత స్కూటర్ ని బయటకు తీశారు. ఆ స్కూటర్ పైనే ఆయన ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశారు.

మల్లారెడ్డి మాస్ ప్రచారం జనాలను బాగా ఆకట్టుకుంటోంది. సామాన్యుడిలాగే ఆయన ప్రజల్లో కలసిపోతున్నారు. ఎక్కడా భేషజాలకు పోరు, నేలపైనే ప్రజల మధ్యే కూర్చుంటారు. వారిలో తానూ ఒకడిని అని చెబుతారు. పిల్లలు, పెద్దలు, మహిళలు.. అందరూ ఆయన అభిమానులే. తాజాగా ముసలావిడను మంత్రి మల్లారెడ్డి ఒడిలో కూర్చోబెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  28 Oct 2023 2:59 AM GMT
Next Story