Telugu Global
Telangana

మూసీ, ఈసీలపై 5 వంతెనలు.. నేడు కేటీఆర్ శంకుస్థాపన

ఐదు వంతెనలు 4 లేన్లతో 15 నెలలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ఐదు వంతెనల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.

మూసీ, ఈసీలపై 5 వంతెనలు.. నేడు కేటీఆర్ శంకుస్థాపన
X

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌లో సుమారు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా ఈసీ, మూసీ నదులపై నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 5 కొత్త వంతెనలు నిర్మించేందుకు రెడీ అయింది. ఇందుకోసం హైదరాబాద్‌ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ-HMDA రూ. 168 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు వంతెనలు 4 లేన్లతో 15 నెలలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ఐదు వంతెనల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ ప్లాన్‌లో భాగంగా ఈసీ నదిపై బుద్వేల్‌ ఐటీ పార్క్‌-1, 2 దగ్గర రెండు వంతెనలు, మూసీ నదిపై మంచిరేవుల దగ్గర ఓ వంతెన, ఉప్పల్ భగాయత్‌ HMDA లే అవుట్‌ దగ్గర మూసీ నదిపై నాలుగో వంతెన, ప్రతాప సింగారం దగ్గర ఐదో వంతెన నిర్మించనున్నారు.

మూసీ, ఈసీ నదులపై మొత్తం 14 వంతెనలు నిర్మించాలని ప్లాన్ చేయగా.. 5 బ్రిడ్జిలను HMDA నిర్మిస్తుంది. మిగతా 9 వంతెనల నిర్మాణ బాధ్యత GHMC తీసుకోనుంది. HMDA నిర్మిస్తున్న 5 వంతెనలకు ఇటీవలే టెండర్లను ఆహ్వానించారు అధికారులు. కొత్తగా నిర్మించే బ్రిడ్జిలు ఆకర్షణీయంగా ఉండేలా పలు డిజైన్‌లను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది.

First Published:  25 Sep 2023 12:28 AM GMT
Next Story