Telugu Global
Telangana

అజార్ తో క్రికెట్ ఆడండి.. ఓటు మాగంటికి వేయండి

అజారుద్దీన్ ఎన్నికల ప్రచారానికి వస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆయనతో క్రికెట్ ఆడాలని సరదాగా వ్యాఖ్యానించారు కేటీఆర్. అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి కానీ ఓటు మాత్రం మాగంటి గోపీనాథ్‌ కు వేయండి అని చెప్పారు.

అజార్ తో క్రికెట్ ఆడండి.. ఓటు మాగంటికి వేయండి
X

హైదరాబాద్ లో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. వరల్డ్‌ కప్‌ క్రికెట్ లో ఇండియా గెలవడం పక్కా, తెలంగాణ ఎన్నికల్లో కేసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని అన్నారాయన. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని చెప్పారు. అభ్యర్థులతోపాటు రోడ్ షో నిర్వహించిన కేటీఆర్, ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.


కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ లో ఇప్పటికే 11 మంది సీఎంలు రెడీ గా ఉన్నరని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మెట్రో రైలు పూర్తి చేయలేక పోయిందని, ఇప్పుడెందుకు మేనిఫెస్టోలో ఆ అంశాన్ని చేర్చిందని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లు ఉండి కూడా చూడలేక పోతున్నారని చెప్పారు కేటీఆర్.

అజార్ వస్తే క్రికెట్ ఆడండి..

అజారుద్దీన్ ఎన్నికల ప్రచారానికి వస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆయనతో క్రికెట్ ఆడాలని సరదాగా వ్యాఖ్యానించారు కేటీఆర్. అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి కానీ ఓటు మాత్రం మాగంటి గోపీనాథ్‌ కు వేయండి అని చెప్పారు. అజారుద్దీన్‌ కు హైదరాబాద్ గల్లీలు కూడా తెలియవని, జూబ్లీహిల్స్ లో ఏ మనిషి తెలియడని చెబుతున్నారు. అజారుద్దీన్‌ ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారని, యూపీలో చెల్లని అజార్, తెలంగాణ హైదరాబాద్‌ లో ఎలా చెల్లుతారని ప్రశ్నించారు.

First Published:  18 Nov 2023 2:47 AM GMT
Next Story