Telugu Global
Telangana

ఓటమి ఫ్రస్టేషన్‌తోనే దాడులు- కేటీఆర్

ప్రజాదరణ ఓర్వలేకే బీఆర్ఎస్ నేల‌పై దాడులకు తెగబడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గువ్వ‌ల బాల‌రాజు కుటుంబ సభ్యులను కేటీఆర్ ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.

ఓటమి ఫ్రస్టేషన్‌తోనే దాడులు- కేటీఆర్
X

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును ఆయన పరామర్శించారు. తెలంగాణలో ఇలాంటి అరాచ‌క సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు కేటీఆర్. రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావొచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాదరణ ఓర్వలేకే బీఆర్ఎస్ నేల‌పై దాడులకు తెగబడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గువ్వ‌ల బాల‌రాజు కుటుంబ సభ్యులను కేటీఆర్ ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బాలరాజు ఎన్నో దాడులను ఎదుర్కొని పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు. ఎలాంటి ఆందోళన వద్దని.. బాలరాజుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీ అంజనీ కుమార్‌ను కోరుతామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని బాల‌రాజు కుటుంబ స‌భ్యుల‌కు కేటీఆర్ హామీ ఇచ్చారు.

శనివారం అర్ధరాత్రి అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఘర్షణలో ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజుకు గాయాలయ్యాయి. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం బాలరాజును హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లి గువ్వల బాలరాజును కేటీఆర్‌ పరామర్శించారు.

First Published:  12 Nov 2023 8:12 AM GMT
Next Story