Telugu Global
Telangana

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష.. కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని వెల్లడి

ఎఫ్.సి.ఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాలను రైతులు పాటిస్తే ఇబ్బందులు ఉండవని, అధికార యంత్రాంగంతో పాటు బాధ్యతగల ప్రతీ ఒక్కరూ ఈ అంశంపై రైతులకు అవగాహన పెంపొందించాలన్నారు సూచించారు.

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష.. కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని వెల్లడి
X

ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ రోజు వరకూ 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఇది గత సీజన్ కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికమని చెప్పారు. ఈరోజు రాజధానిలోని డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ తో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని, కేంద్ర సహకారం ఆశించినంత లేకున్నా యాసంగి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో సేకరిస్తున్నామన్నారు మంత్రి గంగుల. మంగళవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.7,907 కోట్ల విలువ గల ధాన్యాన్ని 6లక్షల 5వేల మంది రైతుల నుండి సేకరించామని, గత కొన్ని రోజులుగా సరాసరి రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 400కి పైగా కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తై మూసేసామన్నారు.

ఎఫ్.సి.ఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాలను రైతులు పాటిస్తే ఇబ్బందులు ఉండవని, అధికార యంత్రాంగంతో పాటు బాధ్యతగల ప్రతీ ఒక్కరూ ఈ అంశంపై రైతులకు అవగాహన పెంపొందించాలన్నారు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశామన్నారు. అక్కడక్కడా ఎదురవుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం తక్షణం స్పందిస్తుందని, విపత్కర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు.

First Published:  23 May 2023 2:08 PM GMT
Next Story