Telugu Global
Telangana

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం... ఒకే ఇంట్లో ఆరుగురి సజీవ దహనం

మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ వూడిపెల్లి గ్రామంలో నిన్న అర్ద‌రాత్రి ఈ సంఘటన జరిగింది.మృతుల్లో ఇంటి యజమాని మాసు శివయ్య (50), అతని భార్య మాసు పద్మ (45), పద్మ అక్క కూతురు మౌనిక (25), మౌనిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితోపాటు సింగరేణి ఉద్యోగి శాంతియ(50) కూడా ఇంట్లో ఉన్నాడు.

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం... ఒకే ఇంట్లో ఆరుగురి సజీవ దహనం
X

మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే ఇంట్లోని ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఇది ప్రమాదమా లేక ఎవరైనా ఇంటికి నిప్పంటించారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ వూడిపెల్లి గ్రామంలో నిన్న అర్ద‌రాత్రి ఈ సంఘటన జరిగింది.మృతుల్లో ఇంటి యజమాని మాసు శివయ్య (50), అతని భార్య మాసు పద్మ (45), పద్మ అక్క కూతురు మౌనిక (25), మౌనిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితోపాటు సింగరేణి ఉద్యోగి శాంతియ(50) కూడా ఇంట్లో ఉన్నాడు. కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక రెండు రోజుల క్రితం పద్మ ఇంటికి వచ్చింది.

మందమర్రి డీసీపీ అఖిల్ మహాజన్, సీఐ ప్రమోదరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పవర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంపై చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విచారణ వేగవంతం చేయాలని ఆయన‌ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

First Published:  17 Dec 2022 3:25 AM GMT
Next Story