Telugu Global
Telangana

మల్లారెడ్డి - మహేష్ బాబు.. సేమ్ టు సేమ్

బాలీవుడ్, హాలీవుడ్ ని తెలుగు వాళ్లే రూల్ చేస్తారని, గతంలో కూడా తాను ఈ విషయాన్ని చెప్పానని గుర్తు చేశారు మల్లారెడ్డి. ముంబై పాతబడిపోయిందని, ఇప్పుడంతా హైదరాబాద్ దే హవా అన్నారు.

మల్లారెడ్డి - మహేష్ బాబు.. సేమ్ టు సేమ్
X

ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న మంత్రి మల్లారెడ్డి.. తమ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా మహేష్ బాబుని చూడగానే ఆయన ఉత్సాహం రెట్టింపైంది. మహేష్ సినిమా బిజినెస్ మేన్ 10సార్లు తాను చూశానని చెప్పారు మల్లారెడ్డి. ఆ సినిమా చూసి ప్రేరణ పొంది తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్ అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

తెలుగువాళ్లు చాలా స్మార్ట్..

బాలీవుడ్, హాలీవుడ్ ని తెలుగు వాళ్లే రూల్ చేస్తారని, గతంలో కూడా తాను ఈ విషయాన్ని చెప్పానని గుర్తు చేశారు మల్లారెడ్డి. ముంబై పాతబడిపోయిందని, ఇప్పుడంతా హైదరాబాద్ దే హవా అన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిన రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ ని ఏలుతున్నారని అన్నారు. యానిమల్ సినిమా సూపర్ హిట్ అవుతుందని, ఆ విషయంలో ధీమాగా ఉండాలని హీరో రణబీర్ కపూర్ కి చెప్పారు మల్లారెడ్డి.

ఈ కాలేజీ గ్రౌండ్ ఎంతో పవిత్రమైనదని, అశ్వమేథ యాగం జరిగిందని, అందుకే ఇక్కడి నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు పుట్టుకొస్తున్నారని అన్నారు. ఇలాంటి గ్రౌండ్ లో ఏ సినిమా ప్రోగ్రామ్ పెట్టినా సూపర్ హిట్ అవుతుందన్నారు. యానిమల్ సినిమా 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందన్నారు మల్లారెడ్డి.

మల్లారెడ్డి పాలమ్మిన, పూలమ్మిన డైలాగులు కూడా ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచాయి. పాటల రచయిత అనంత శ్రీరామ్ మల్లారెడ్డి స్టైల్ లో స్పీచ్ ఇచ్చారు. యానిమల్ సినిమా ఫంక్షన్లో ఆ సినిమా నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. రాజమౌళి, మహేష్ బాబు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఎంతమంది సినీ తారలు ఉన్నా.. మంత్రి మల్లారెడ్డి స్పీచ్ మాత్రం ఈ కార్యక్రమంలో హైలైట్.

First Published:  28 Nov 2023 2:24 AM GMT
Next Story