Telugu Global
Telangana

కేటీఆర్‌తో మీటింగ్‌కు డుమ్మా.. మల్లారెడ్డి క్లారిటీ..!

తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్‌ కుటుంబ సభ్యులు నమ్మొద్దన్నారు మల్లారెడ్డి. ఇలాంటి వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.

కేటీఆర్‌తో మీటింగ్‌కు డుమ్మా.. మల్లారెడ్డి క్లారిటీ..!
X

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి. ఉద్దేశపూర్వకంగానే మల్లారెడ్డి హాజరుకాలేదంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వివరణతో ఓ పోస్టు పెట్టారు.

తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్‌ కుటుంబ సభ్యులు నమ్మొద్దన్నారు మల్లారెడ్డి. ఇలాంటి వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు మల్లారెడ్డి. ఆల్వేస్ విత్ కేసీఆర్ అంటూ హ్యాష్‌ ట్యాగ్ జోడించారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశానికి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో వీరి వ్యవహారంపై సోషల్‌మీడియా, మీడియాలో పెద్ద చర్చ జరిగింది. దీంతో మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.


First Published:  4 Dec 2023 12:28 PM GMT
Next Story