Telugu Global
Telangana

పిచ్చోడి చేతిలో రాయి - లవంగం చేతిలో బీజేపీ - కేటీఆర్ సెటైర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ వ్యంగ్య విమర్శలు చేశారు. కేసీఆర్ బ్లాక్ మ్యాజిక్ (తాంత్రిక విద్యలు) చేస్తున్నారని బండి సంజయ్ చేసిన ఆరోపణలపై స్పందించిన కేటీఆర్ 'పిచ్చోడి చేతిలో రాయి - లవంగం చేతిలో బీజేపీ' అని ట్వీట్ చేశారు

పిచ్చోడి చేతిలో రాయి - లవంగం చేతిలో బీజేపీ - కేటీఆర్ సెటైర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ మ్యాజిక్ (తాంత్రిక విద్యలు) చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై టీఆరెస్ పార్టీ మండిపడుతోంది. నిన్నటి నుంచి బండి సంజయ్ పై టీఆరెస్ నేత‌లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో నిన్నటి నుంచి బండి సంజయ్ పై ద్వజమెత్తుతున్నారు. ఈ రోజు కూడా ఆయన సంజయ్ మీద వ్యంగ్యమైన విమర్శలతో ట్వీట్ చేశారు.

నల్ల పిల్లులు... తాంత్రికులు అని హెడ్డింగ్ పెట్టి

''తెలంగాణకు ఎన్‌డిఎ ప్రభుత్వం ఇచ్చింది శూన్యం కాబట్టి ఇప్పుడు మీరు బ్లాక్ మ్యాజిక్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది.

పిచ్చోడి చేతిలో రాయి = లవంగం చేతిలో బీజేపీ'' అని ట్వీట్ చేశారు కేటీఆర్.

కేటీఆర్ చేసిన ట్వీట్ కు నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ''బీజేపీలో చేరిన తరువాత ₹18,000 కోట్ల కాంట్రాక్టు వచ్చింది అని కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నాడు.

ఇప్పుడు ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి క్షుద్ర పూజలు అంటూ కొత్త డ్రామాకి తెరలేపింది బీజేపీ

మొన్నటివరకు దేవుళ్ల పేరుతో రాజకీయాలు..ఇప్పుడు క్షుద్ర పూజలు అంటూ కొత్త నాటకాలు'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఆయనే మరో ట్వీట్ లో..

''దొంగే దొంగ దొంగ… అని అరుస్తున్నట్టుంది బీజేపీ నాయకుల యవ్వారం

భూత వైద్యంలో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది.

భూత వైద్యంలో 6 నెలల సర్టిఫికెట్ కోర్సును మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ(BHU) ప్రారభించింది.'' అని ట్వీట్ చేశారు.

ఇంకా అనేక మంది నెటిజనులు కేటీఆర్ ట్వీట్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు.


First Published:  9 Oct 2022 11:24 AM GMT
Next Story