Telugu Global
Telangana

కరోనా నుంచి కోలుకున్న కేటీఆర్

వారం రోజుల క్రితం కరోనా బారిన పడ్డ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు కోలుకున్నారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారు.

కరోనా నుంచి కోలుకున్న కేటీఆర్
X

తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. వారం రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటీవ్ రాగా ఆయన అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే ట్విట్టర్ ద్వారా ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన ట్విట్టర్ లో బీజెపి తో పోరాటం కొనసాగించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్షలకు ధీటైన జవాబులిచ్చారు.

ఇక ఈ రోజు నుంచి తిరిగి ఆయన రెగ్యులర్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు వైద్యులు చేసిన పరీక్షలో కేటీఆర్ కు నెగెటివ్ నిర్దారణ కావడంతో రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.

First Published:  5 Sep 2022 9:28 AM GMT
Next Story