Telugu Global
Telangana

మావాళ్ల జోలికి వస్తే క్రేన్‌కు వేలాడదీస్తా- కొండా మురళీ

కొత్తగా వచ్చేవాళ్లతో అనుచరులు, కార్యకర్తలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని కొండా మురళీ సూచించారు. తన కార్యకర్తలను టచ్‌ చేస్తే క్రేన్‌కు వేలాడదీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Konda Murali: మావాళ్ల జోలికి వస్తే క్రేన్‌కు వేలాడదీస్తా- కొండా మురళీ
X

మావాళ్ల జోలికి వస్తే క్రేన్‌కు వేలాడదీస్తా- కొండా మురళీ

వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ రాజుకుంది. కొండా దంపతులకు, వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మధ్య ఫైట్‌ మొదలైంది. బుధవారం రాత్రి ఈ రెండు వర్గాలవారు పరస్సరం కొట్టుకున్నారు. ఎర్రబెల్లి స్వర్ణను జిల్లా అధ్యక్షురాలిగా నియిమించిన నేపథ్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొండా వర్గీయులు, స్వర్ణ వర్గీయులు పరస్పరం కొట్టుకున్నారు.ఆ కార్యక్రమానికి కొండా దంపతులు మాత్రం హాజరుకాలేదు.

వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీ చేయాలనుకుంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి పాదయాత్రలోనే ఆ అంశంపై ఆమె స్పష్టత తీసుకున్నారు. ఇంతలో అనూహ్యంగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ తూర్పులో యాక్టివ్ అయ్యారు. ఆమెకు జిల్లా అధ్యక్షురాలిగా కూడా నియమించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ స్వర్ణకు ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చేవాళ్లతో అనుచరులు, కార్యకర్తలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తన కార్యకర్తలను టచ్‌ చేస్తే క్రేన్‌కు వేలాడదీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలపై దాడులు చేసినవారిపై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు చర్యలు తీసుకోకపోతే మాత్రం.. తనలోని పాత కొండా మురళి బయటకు వస్తాడని హెచ్చరించారు.

కొందరు వచ్చి ఇక్కడ మీటింగ్‌లు పెడుతున్నారని.. ఎవరొచ్చినా ఇక్కడ పోటీ చేసేది మాత్రం కొండా సురేఖనేనన్నారు. రెండు పడవల మీద ప్రయాణం చేస్తే బోల్తా కొడుతారని.. అటుఇటు కాకుండాపోతారని కామెంట్స్‌ చేశారు. వరంగల్ తూర్పు టికెట్‌ కొండా సురేఖదేనని మురళీ ప్రకటించారు. ఈ విషయాన్ని రేవంత్‌ రెడ్డి కూడా చెప్పారన్నారు. ఎంత మంది అడ్డుపడినా పోటీ చేసి గెలిచేది కొండా సురేఖనేనన్నారు.

First Published:  1 Jun 2023 7:07 AM GMT
Next Story