Telugu Global
Telangana

మునుగోడు పోను.. నేను హోంగార్డు.. ఎస్పీలు వెళ్తారు

మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఒక పెద్దమనిషి వంద కేసులు పెట్టినా సరే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా అన్నాడు..కాబట్టి ఆయన గెలిపిస్తాడు.. ఎక్కువ మంది కలిస్తే గందరగోళం అవుతుందని వ్యాఖ్యానించారు.

మునుగోడు పోను.. నేను హోంగార్డు.. ఎస్పీలు వెళ్తారు
X

మనుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లబోనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో హోంగార్డు లాంటి వాడినని... ఎస్పీ రేంజ్‌ వారే ఎన్నికల ప్రచారానికి వెళ్తారని సెటైర్లు వేశారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఒక పెద్దమనిషి వంద కేసులు పెట్టినా సరే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా అన్నాడు..కాబట్టి ఆయన గెలిపిస్తాడు.. ఎక్కువ మంది కలిస్తే గందరగోళం అవుతుందని వ్యాఖ్యానించారు. అతడే ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారంటూ కామెంట్ చేశారు.

ఇక మాతో పని లేదని కూడా కోమటిరెడ్డి స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి... తానెప్పుడు విదేశాలకు వెళ్తున్నానో కేటీఆర్‌నే అడగండి అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు ఎవరికేశారని ప్రశ్నించగా.. ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికేశామో చెబుతామా.. ఓటు ఎవరికి వేశారని అగడటం చాలా పెద్ద తప్పు అంటూ మాట్లాడారు.

కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మీదే అని భావిస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డే తనపై కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టించినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా అని వ్యాఖ్యానించారు. ఆ మాటలను దృష్టిలో ఉంచుకునే కోమటిరెడ్డి కామెంట్స్ చేసి ఉండవచ్చు.

First Published:  17 Oct 2022 8:56 AM GMT
Next Story