Telugu Global
Telangana

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్య‌త్వానికి టీఆరెస్ ఎంపీ రాజీనామా!

టీఆరెస్ ఎంపీ కే.కేశవ రావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్య‌త్వానికి రాజీనామా చేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే తాను రాజీనామా చేసిన‌ట్లు కేశవరావు లేఖ విడుదల చేసినప్పటికీ ఆయన రాజీనామా విషయంపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్య‌త్వానికి టీఆరెస్ ఎంపీ రాజీనామా!
X

టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈయన అక్టోబర్ 2021 లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సభ్యుడిగా నియమితులయ్యారు.

వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే తాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ట్లు కేశవరావు లేఖ విడుదల చేసినప్పటికీ ఆయన రాజీనామా విషయంపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

దేశంలో రోజు రోజుకూ కరువవుతున్న వాక్ స్వాతత్య్రం, మీడియా స్వేచ్చ తదితర అంశాల పట్ల కొంత కాలంగా కేకే ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీడియాకు కనీస స్వేచ్చ లేకుండా చేసిన తర్వాత ప్రెస్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉండి కూడా ఉపయోగంలేదనే అభిప్రాయంతో ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల్లో ఎడిటర్స్ గిల్డ్ నుంచి ఆరుగురు, వర్కింగ్ జర్నలిస్టుల నుంచి ఏడుగురు, మధ్య తరహా, చిన్న తరహా వార్తాపత్రికల యాజమాన్యాల నుంచి ఇద్దరేసి, న్యూస్ ఏజెన్సీ మేనేజర్లు, యూజీసీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సాహిత్య అకాడమీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.


First Published:  26 Sep 2022 8:15 AM GMT
Next Story