Telugu Global
Telangana

రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు - కిషన్ రెడ్డి ఫైర్

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును మారుస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. హైదర్ ఎవరు..? ఆ పేరును ఇంకా ఎందుకు ఉంచాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు - కిషన్ రెడ్డి ఫైర్
X

రైతు బంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత హామీలతో ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీల డీఎన్ఏ, గోత్రం ఒక్కటేనని అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటున్న వారిని చెప్పుతో కొట్టాలని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పడానికి రాహుల్ గాంధీకి సిగ్గు, శరం ఉండాలని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే తాసు ముక్కలని, కుటుంబ పార్టీలను బీజేపీ ఎప్పటికీ వదిలిపెట్టదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ పోరాటం ఆగదని చెప్పారు. వెయ్యి మంది కేసీఆర్‌లు, లక్ష మంది రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో మళ్లీ ప్రధానమంత్రి మోడీనే అని చెప్పారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును మారుస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. హైదర్ ఎవరు..? ఆ పేరును ఇంకా ఎందుకు ఉంచాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్నారు. ఇప్పటికే దేశంలో పలు నగరాల పేర్లు మారాయని చెప్పారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు అని, పాతబస్తీని అభివృద్ధి చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

First Published:  27 Nov 2023 11:09 AM GMT
Next Story