Telugu Global
Telangana

విషాదాంతం.. అమెరికాలో క‌త్తిపోట్ల‌కు గురైన ఖ‌మ్మం విద్యార్థి మృతి

గత నెల 31న జిమ్‌లో ఉండ‌గా అత‌న్ని ఓ దుండ‌గుడు క‌త్తితో కణతపై పొడిచాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ‌రుణ్‌ను పోలీసులు ఆస్పత్రికి త‌ర‌లించారు.

విషాదాంతం.. అమెరికాలో క‌త్తిపోట్ల‌కు గురైన ఖ‌మ్మం విద్యార్థి మృతి
X

భ‌విష్య‌త్తుపై ఎన్నో ఆశ‌ల‌తో అమెరికాలో అడుగుపెట్టిన ఆ విద్యార్థి జీవితం అర్ధంత‌రంగా ముగిసిపోయింది. అమెరికాలో క‌త్తిపోట్ల‌కు గురై వారం రోజులుగా ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతున్న తెలుగు విద్యార్థి వరుణ్ రాజ్ మృతి చెందాడు. ఈ మేర‌కు ఆస్ప‌త్రి నుంచి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందింది.

ఎంఎస్ చ‌దవ‌డానికి వెళ్లి.. దుండ‌గుడి క‌త్తికి బ‌ల‌య్యాడు

ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్ రాజ్(29) అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ అక్క‌డే పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. గత నెల 31న జిమ్‌లో ఉండ‌గా అత‌న్ని ఓ దుండ‌గుడు క‌త్తితో కణతపై పొడిచాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ‌రుణ్‌ను పోలీసులు ఆస్పత్రికి త‌ర‌లించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు ఈ రోజు చ‌నిపోయాడు.

దాడిని ఖండించిన అమెరికా ప్ర‌భుత్వం

అమెరికాలో తెలంగాణ విద్యార్థి కత్తి పోట్లకు గురైన అంశంపై అమెరికా సర్కార్ వెంట‌నే స్పందించింది. నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పింది. వ‌రుణ్ రాజ్ కోలుకునేంత‌వ‌ర‌కు అక్క‌డి ఎంబ‌సీతో క‌లిసి సాయం అందిస్తామ‌ని మంత్రి కేటీఆర్ కూడా ప్ర‌క‌టించారు.

First Published:  8 Nov 2023 5:48 AM GMT
Next Story